Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకేలో చిక్కుకుపోయిన విద్యార్థులకు సహాయం చేయండి: పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (21:35 IST)
భారతదేశం నుంచి ఉన్నత విద్య కోసం యూకే వెళ్ళిన 300 మంది విద్యార్థులు కరోన విస్తృతితో తీవ్ర భయాందోళనలో ఉన్నారని.. వారిని ఆదుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి శ్రీ ఎస్.జైశంకర్‌కు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ట్విటర్ ద్వారా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ పంపించారు. 
 
అక్కడ చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తమ సమస్యను జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు స్పందించి కేంద్ర మంత్రికి లేఖ రాశారు. “కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో మీరు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. మీ దృష్టికి యూకేలో చిక్కుకున్న వారి బాధలు తీసుకు వస్తున్నాను. 
 
స్వదేశానికి వచ్చేయడానికి ప్రయత్నించిన ఆ విద్యార్థులు యూకే విమానాశ్రయాల్లో, లండన్ లోని హై కమిషన్ ఆఫ్ ఇండియాలో ఉండిపోవడంతో... వారు స్వదేశానికి వచ్చే మార్గం లేకుండాపోయింద”ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గత 12 రోజులుగా వారికి సరైన ఆహారం, వసతి లేక ఇబ్బందులుపడుతున్నారన్నారు. 
 
వైరస్ వ్యాప్తితో మరింత భయాందోళనలకు లోనవుతున్నారని, మన విదేశీ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించి తగిన ఆహార, వసతి సదుపాయాలు కల్పించాలని కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి.మురళీధరన్ దృష్టికీ ఈ సమస్యను తీసుకువెళ్లారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments