Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిరిసిల్లా జిల్లాలో చిరుతపులి సంచారం.. భయాందోళనలో జనం

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (09:51 IST)
తెలంగాణలో గత కొన్ని రోజులుగా చిరుత పులుల సంచారం ఎక్కువైంది. చిరుత పులులు వనాలు విడిచి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడ సమీపంలో చిరుత సంచరించింది. 
 
మూడు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులో కనిపించిన చిరుత, ఈ రోజు తెల్లవారుజామున వేములవాడ అర్బన్‌ మండలంలోని మారుపాక శివారులో సంచరించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. 
 
ఈ విషయాన్ని రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిరుతపులి సంచారంతో వేములవాడ పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 
 
ఇక, బోయినపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని వ్యవసాయ బావిలో చిరుతపులి కనిపించిన సంగతి తెలిసిందే. కోరెపు సురేష్‌కు చెందిన వ్యవసాయ బావిలో బుధవారం చిరుత పడి ఉండటాన్ని రైతులు గుర్తించారు. దీంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments