Webdunia - Bharat's app for daily news and videos

Install App

లష్కర్‌ బోనాలు ప్రారంభం - తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని

Webdunia
ఆదివారం, 17 జులై 2022 (10:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే లష్కర్‌ బోనాల మహోత్సవాలకు సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం సిద్ధమైంది. ఉత్సవాల్లో తొలిరోజైన ఆదివారం తెల్లవారుజామున 4:05 నిమిషాలకు ఆలయ ద్వారాలు తెరవనున్నారు. తొలుత అమ్మవారికి మహామంగళ హారతి ఇవ్వనున్నారు. 
 
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. తొలిరోజు ముఖ్యమంత్రితోపాటు పార్టీ నేతలు, సంఘాల నాయకులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం సాధారణ భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నారు. 
 
తొలి బోనం సమర్పించిన తర్వాత మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, రైతులు పాడిపంటలతో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ బోనాల జాతరకు ఆహ్వానించామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. 
 
మరోవైపు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని వరద ముంపును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆ తర్వాత ఏటూరునాగారం మీదుగా హైదరాబాద్‌కు వస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జానీ మాస్టర్‌కు కోర్టులో చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేత

పీరియాడిక్ కథతో కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన చిత్రమే క: హీరో కిరణ్ అబ్బవరం

పొట్టేల్ నుంచి పటేల్ గా అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

మహేష్ బాబు పచ్చిగొల్ల దర్శకత్వంలో ఉస్తాద్ రామ్ పోతినేని చిత్రం

ప్రియదర్శితో సారంగపాణి జాతకం చెప్పబోతున్న మోహనకృష్ణ ఇంద్రగంటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

ఖాళీ కడుపుతో లవంగాలను నమిలితే?

పోషకాల గని సీతాఫలం తింటే ఈ వ్యాధులన్నీ దూరం

తర్వాతి కథనం
Show comments