Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ పట్టాభిషేకానికి అద్భుతమైన ముహూర్తం.. రథ సప్తమి రోజునే..?

Webdunia
శుక్రవారం, 22 జనవరి 2021 (09:39 IST)
KCR_KTR
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల తారకరామారావు పేరు ఖాయమైంది. అయితే, ఆయన పట్టాభిషేకం ఎప్పుడనే అంశం మీదే ఇప్పుడు అందరిలోనూ చర్చ జరుగుతోంది. దీని కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ దివ్యమైన ముహూర్తం ఖరారు చేసినట్టు తెలిసింది. ఫిబ్రవరి 18వ తేదీన కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం. 
 
ఫిబ్రవరి 18న ఎందుకు అంటే ఆ రోజు రథసప్తమి. హైందవ సంప్రదాయంలో రథసప్తమికి చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని సూర్యజయంతి, వైవస్వత మన్వాది అని కూడా పిలుస్తారు. ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు పుట్టిన రోజుగా దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది. ఆ రోజు చేపట్టే పనులు దిగ్విజయంగా కొనసాగుతాయని నమ్మకం. అలాంటి రోజున కేటీఆర్‌కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. 
 
ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 19న రెండు రోజులు కూడా సప్తమి తిథి ఉంది. ఒకరోజు ఎక్కువ సమయం, మరో రోజు తక్కువ సమయం ఉంది. అలాగే, ఫిబ్రవరి 19వ తేదీన ఛత్రపతి శివాజీ జయంతి. రెండు కలసి వచ్చేలా ఫిబ్రవరి 19న కూడా చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments