Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయనే కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం... కోమటిరెడ్డి

తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదారు సీట్లు కూడా రావనీ, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (16:35 IST)
తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదారు సీట్లు కూడా రావనీ, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరడుగట్టిన సమైక్యవాది కిరణ్ కుమార్ రెడ్డికి కుడిభుజం అనీ, అలాంటివాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా వుంటే ఇక పార్టీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. 
 
తనను ఎన్నో అవమానాలకు గురిచేసినా పార్టీ కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనను పొమ్మనలేక పొగబెడుతున్నారనీ, ఇదంతా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఉత్తమకుమార్ రెడ్డే 2019 ఎన్నికల దాకా కొనసాగితే తాము పార్టీలో కొనసాగేది లేదని తేల్చి చెప్పారు. తామే కాదు.. చాలామంది కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిపోతారని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అధిష్టానం తెలంగాణ పీసీసి అధ్యక్షుడిని మార్చి పార్టీని బతికించుకోవాలని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments