Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ మిస్సింగ్... వైద్యులే కాజేశారంటూ రోగి బంధువులు...

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (19:31 IST)
కడుపులో నొప్పిగా ఉందని ఆసుపత్రిలో చేరితే చికిత్స పేరుతో వైద్యులు కిడ్నీని కాజేశారంటూ ఓ రోగి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన హైదరాబాద్ మలక్ పేట యశోద ఆస్పత్రి ముందు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... శివ ప్రసాద్ గౌడ్ అనే వ్యక్తికి కడుపులో నొప్పిగా ఉండటంతో చికిత్స చేయించుకోవడం కోసం యూఎస్ఏ నుండి వచ్చి మలక్ పేట యశోద ఆసుపత్రిలో చేరారు. 
 
పరీక్ష చేసిన వైద్యులు కడుపులో ట్యూమర్ ఉందని చెప్పారు. శస్త్ర చికిత్స చేసి ట్యూమర్‌ని తీసి శివప్రసాద్ తల్లిదండ్రులకు చూపించారు. అయితే కొద్ది గంటల తర్వాత అతని ఆరోగ్యం మరింత విషమించింది. డాక్టర్లు అతడిని వెంటిలేటర్‌లో ఉంచి చికిత్స అందించారు. అక్కడ పనిచేసే డాక్టర్ ఉమాశంకర్ చెపుతూ...  శివప్రసాద్ శరీరం నుండి ఒక కిడ్నీ తీసివేసి ఉందని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు.
 
ముందురోజే చికిత్స కోసం పది లక్షలు చెల్లించామనీ, ఇంతలో కిడ్నీ ఎలా మాయమైందని డాక్టర్‌లను నిలదీశారు. మీరే కీడ్నీని దొంగిలించారని వైద్యులపై ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు. హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments