Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రక్తదానం పేరుతో కిడ్నీ కాజేసిన వైద్యులు...

Advertiesment
Madurai
, శుక్రవారం, 1 మార్చి 2019 (15:03 IST)
రక్తదానం పేరుతో ఏకంగా కిడ్నీనే కొట్టేశారు వైద్యులు. తమిళనాడు రాష్ట్రంలోని మదురైకు చెందిన రాజా మహ్మద్ అనే వ్యక్తి తన అక్క కుమారుడు అజారుద్దీన్‌కి ఆరోగ్యం సరిగ్గాలేదని, వెంటనే అతనికి రక్తం ఎక్కించాలని మహ్మద్ ఫక్రుద్దీన్ అనే వ్యక్తిని కోరాడు. స్నేహితుడు అడుగుతున్నాడని ఫక్రుద్దీన్ రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. 
 
అయితే తనను ఆసుపత్రికి తీసుకువెళ్లిన నిందితుడు అసలు విషయం చెప్పలేదు. డాక్టర్లు నీ రక్తం తీసుకుంటామని, అయితే దానికి ముందు కొన్ని చికిత్సలు చేయాలని చెప్పారు. దానికి అతను సమ్మతించాడు. కొన్నాళ్ల తర్వాత అనారోగ్యానికి గురైన ఫక్రుద్దీన్ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యులు పరీక్ష చేసి ఒక కిడ్నీ లేదని చెప్పారు. దాంతో అతను షాక్‌కి గురయ్యాడు. 
 
తాను మోసపోయానని గ్రహించాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లి షకీలాబాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. అసలు నిజాన్ని బయటకు కక్కించారు. మేనల్లుడికి కిడ్నీ పాడైందని, కిడ్నీ ఇవ్వడానికి ఎవరూ ముందుకురారని ఇలా చేశానని. ఆ కిడ్నీని అతడిని అమర్చారని రాజా మహ్మద్ ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను మగాడిని కాదు.. మహిళను.. జైల్లో ట్రాన్స్‌జెండర్ గగ్గోలు