Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవ ఆపమంటే ఆపలేదని తుపాకీతో కాల్చాడు...

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (18:52 IST)
ఆవేశంలో మనుషులు ఏమి చేస్తారో వారికే తెలియదు. యువకులు పార్టీ చేసుకుంటూ గొడవ చేస్తున్నారని వారిలో ఒకరిని కాల్చేశాడు ఓ వ్యక్తి. గొడవ ఆపమని చెప్పినా వినకపోవడంతో వాగ్వివాదానికి దిగి ఈ పని చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
ఆదివారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ పైనున్న ఖాళీ స్థలంలో మోహిత్‌ చంద్ర(24) అనే వ్యక్తి తన ముగ్గురి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. అదే భవంతిలోని 3వ అంతస్తులో నీరజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. పార్టీలో రాత్రి వారు గొడవ చేయడం చూసి 12 గంటల సమయంలో భార్య అక్కడకు వెళ్లి వారిని మందలించింది. భార్యతోపాటు నీరజ్ కూడా అక్కడికి వచ్చాడు. 
 
మోహిత్, నీరజ్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వెంటనే నీరజ్ తన ఫ్లాట్‌లోకి వెళ్లి తుపాకీ తెచ్చి మోహిత్‌ని కాల్చాడు. తల పైన తీవ్ర గాయాలవటంతో కుటుంబ సభ్యులు అతడిని ఫోర్టిస్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నీరజ్ తరచుగా గాలిలో కాల్పులు జరిపేవాడని కూడా దృష్టికి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Praveen: మారుతీ వల్లే నా లైఫ్ సెట్ అయింది : కమెడియన్‌ ప్రవీణ్‌

Raj: సమంత శుభం తో రాజ్ ను జీవితభాగస్వామిని ఎంచుకుందా !

Blackbuck poaching case: కృష్ణ జింకల వేట కేసు: సైఫ్ అలీ ఖాన్, టబు, నీలం, సోనాలి కు షాక్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments