Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవ ఆపమంటే ఆపలేదని తుపాకీతో కాల్చాడు...

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (18:52 IST)
ఆవేశంలో మనుషులు ఏమి చేస్తారో వారికే తెలియదు. యువకులు పార్టీ చేసుకుంటూ గొడవ చేస్తున్నారని వారిలో ఒకరిని కాల్చేశాడు ఓ వ్యక్తి. గొడవ ఆపమని చెప్పినా వినకపోవడంతో వాగ్వివాదానికి దిగి ఈ పని చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
ఆదివారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ పైనున్న ఖాళీ స్థలంలో మోహిత్‌ చంద్ర(24) అనే వ్యక్తి తన ముగ్గురి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. అదే భవంతిలోని 3వ అంతస్తులో నీరజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. పార్టీలో రాత్రి వారు గొడవ చేయడం చూసి 12 గంటల సమయంలో భార్య అక్కడకు వెళ్లి వారిని మందలించింది. భార్యతోపాటు నీరజ్ కూడా అక్కడికి వచ్చాడు. 
 
మోహిత్, నీరజ్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వెంటనే నీరజ్ తన ఫ్లాట్‌లోకి వెళ్లి తుపాకీ తెచ్చి మోహిత్‌ని కాల్చాడు. తల పైన తీవ్ర గాయాలవటంతో కుటుంబ సభ్యులు అతడిని ఫోర్టిస్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నీరజ్ తరచుగా గాలిలో కాల్పులు జరిపేవాడని కూడా దృష్టికి వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments