Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొడవ ఆపమంటే ఆపలేదని తుపాకీతో కాల్చాడు...

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (18:52 IST)
ఆవేశంలో మనుషులు ఏమి చేస్తారో వారికే తెలియదు. యువకులు పార్టీ చేసుకుంటూ గొడవ చేస్తున్నారని వారిలో ఒకరిని కాల్చేశాడు ఓ వ్యక్తి. గొడవ ఆపమని చెప్పినా వినకపోవడంతో వాగ్వివాదానికి దిగి ఈ పని చేశాడు. ఈ ఘటన ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
ఆదివారం రాత్రి ఓ అపార్ట్‌మెంట్ పైనున్న ఖాళీ స్థలంలో మోహిత్‌ చంద్ర(24) అనే వ్యక్తి తన ముగ్గురి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు. అదే భవంతిలోని 3వ అంతస్తులో నీరజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. పార్టీలో రాత్రి వారు గొడవ చేయడం చూసి 12 గంటల సమయంలో భార్య అక్కడకు వెళ్లి వారిని మందలించింది. భార్యతోపాటు నీరజ్ కూడా అక్కడికి వచ్చాడు. 
 
మోహిత్, నీరజ్‌ల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వెంటనే నీరజ్ తన ఫ్లాట్‌లోకి వెళ్లి తుపాకీ తెచ్చి మోహిత్‌ని కాల్చాడు. తల పైన తీవ్ర గాయాలవటంతో కుటుంబ సభ్యులు అతడిని ఫోర్టిస్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నీరజ్ తరచుగా గాలిలో కాల్పులు జరిపేవాడని కూడా దృష్టికి వచ్చింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments