Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెసిఆర్‌కి ప్రధాని ఛాన్స్... ఎంపి కవిత

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (17:19 IST)
తెలంగాణాలో కుటుంబ పాలన ఎక్కువైపోయిందంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలైతే కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవితలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాల విమర్శలను పెద్దగా పట్టించుకోని కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ వైపు ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణాలో టిఆర్ఎస్ భారీ విజయం తరవాత కెసిఆర్ దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
 
ఇప్పటికే పశ్చిమబెంగాల్‌కు వెళ్ళి మమతా బెనర్జీని కలిశారు కెసిఆర్. ఫెడరల్ ఫ్రంట్‌ను విస్తరించే దిశగా ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో నిజమాబాద్ ఎంపి కల్వకుంట కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పైన నమ్మకం ఏర్పడి దేశ రాజకీయాల్లో కెసిఆర్ చక్రం తిప్పడం ఖాయమని, త్వరలోనే కెసిఆర్ ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉందన్నారామె. 
 
తెలంగాణా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని, ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యమై ముందుకు సాగే తరుణం ఆసన్నమైందని ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments