Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇమ్రాన్ ఖాన్ ఇక ఆపండి.. భారత్‌ను చూసి నేర్చుకోండి... ఓవైసీ ఫైర్

Advertiesment
ఇమ్రాన్ ఖాన్ ఇక ఆపండి.. భారత్‌ను చూసి నేర్చుకోండి... ఓవైసీ ఫైర్
, సోమవారం, 24 డిశెంబరు 2018 (13:09 IST)
పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్.. భారత మైనారిటీలపై నోరు విప్పడం వివాదాస్పదమైంది. ఒక సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్‌లో మైనారిటీలను ఇతర పౌరులతో సమానంగా చూడట్లేదన్నారు. బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే.. అది తిరుగుబాటుకు దారితీస్తుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత అసదుద్ధీన్ ఓవైసీ స్పందించారు. 
 
మైనారిటీలతో ఎలా మెలగాలో మోదీ ప్రభుత్వానికి చూపిస్తామని ఇమ్రాన్ చేసిన కామెంట్స్‌పై ఓవైసీ కౌంటరిచ్చారు. మైనారిటీల సంక్షేమం, రాజ్యాంగ హక్కుల విషయంలో భారతదేశాన్ని చూసి పాకిస్థాన్ చాలా నేర్చుకోవాలని సూచించారు. పాక్ రాజ్యాంగం ప్రకారం ముస్లిం వ్యక్తి మాత్రమే దేశ ప్రధాని కాగలడు, కానీ భారత్‌లో అన్నీ వర్గాల ప్రజలకు ఆ అవకాశం వుందని అసదుద్ధీన్ స్పష్టం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్మార్ట్‌ఫోన్ ఇస్తాను.. గేమ్ ఆడుకోమని అత్యాచారానికి పాల్పడ్డాడు..