Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెసిఆర్ రాజకీయ ఉగ్రవాది, దళిత ద్రోహి... తెలంగాణ కాంగ్రెస్ నేతలు

Webdunia
శుక్రవారం, 12 జులై 2019 (08:51 IST)
కేసీఆర్ దళిత ద్రోహి అని, రాజకీయ ఉగ్రవాది అని తెలంగాణ కు చెందిన కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు తదితరులు ధ్వజమెత్తారు. తెలంగాణ లో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా జరిపిన నేతలు మాట్లాడుతూ...
 
"అన్యాయాన్ని ఎదుర్కునే తెలంగాణ గడ్డను ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ పిదప అణచివేయబడుతున్న గడ్డగా మార్చిన చరిత్ర కెసిఆర్ దే. తెలంగాణ లో పాలకులు అంబేత్కర్ విగ్రహాలను చూసి భయపడుతున్నారు. విగ్రహాలను కూల్చారు, విగ్రహాలను ఎత్తుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. 
 
ఇది విగ్రహాలకు సంబంధించిన అంశం కాదు. రాజ్యాంగాన్ని రచించి  బడుగు బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన ఒక మహనీయుని అవమానించడం ఏమిటి. 
 
ఇది అణచివేత కు పరాకాష్ట కాదా ? పాలన రాజ్యాంగబద్దంగా జరగాలి, చట్ట సభలు చట్టలను చేసి వాటిని ప్రజల కోసం అమలు చేయాలి. ఇవన్నీ ఎలా ఉండాలో నేర్పించిన మహనీయులు అంబేత్కర్ ఆయనను అవమణిస్తే ఈ దేశంలోని కోట్లాది ప్రజలను అవమానించినట్టే.. 
 
ఢిల్లీ లో జరుగుతున్న ఈ ఉద్యమం దేశ వ్యాప్తం కావాలి. మరోసారి హక్కుల కోసం పోరాటం ఉదృతం చేయాలి. తెలంగాణ ఒక అణచివేత కేంద్రంగా మారింది. కనీస హక్కులు కూడా అమలు కావడం లేదు. నియంతలా రాజరిక పాలన చేస్తున్నారు. ఇది సహించరానిది. దీనిని అడ్డుకోవాలి, ఎదిరించాలి. ప్రజలు అంటే ఏంటో చూపాలి" అని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments