Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిలేష్ మాతో టచ్‌లో వున్నారు... మా చర్చల్లో రాజకీయాలు చూడొద్దు: కేసీఆర్

ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం తమ ప్రయత్నం కొనసాగుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే చాలా కష్టపడాలని తెలిపారు. కొంతమంది తెలిసీతెలియక చిన్న ప్రయత్నమనుకుంటున్నారని.. అఖిలేశ్‌తో చర్చలతో తమ ప్రయత్నమేంటో అందరికీ తెలుస్తుందన్నారు. బుధవా

Webdunia
బుధవారం, 2 మే 2018 (21:04 IST)
ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం తమ ప్రయత్నం కొనసాగుతోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే చాలా కష్టపడాలని తెలిపారు. కొంతమంది తెలిసీతెలియక చిన్న ప్రయత్నమనుకుంటున్నారని.. అఖిలేశ్‌తో చర్చలతో తమ ప్రయత్నమేంటో అందరికీ తెలుస్తుందన్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో అఖిలేశ్ యాదవ్‌తో జరిగిన చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ.. చాలా రోజులుగా టచ్‌లో ఉన్నామని.. దేశంలో రాజకీయ వ్యవస్థ, సుపరిపాలనపై చర్చించామని తెలిపారు. 
 
తమ చర్చల్లో రాజకీయాలను చూడకండని కోరారు. దేశంలో మార్పు కోసం మాత్రమే తమ ప్రయత్నాలని తెలిపారు. ఒక్కోచోట ఒక్కో ప్రయత్నం జరుగుతుందన్నారు. 2019 ఎన్నికల కోసం తమ ప్రయత్నాలు కాదన్నారు. ఓ గొప్ప మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నంగా దీన్ని చూడాలన్నారు. అయితే ఒకరిద్దరితో అయ్యేది కాదు అని.. రెండు మూడు నెలల్లో ఒక అజెండా రూపొందిస్తామన్నారు కేసీఆర్. 
 
ఆ తర్వాత ఎవరు కలిసి వస్తారో వాళ్లతో కలసి పని చేస్తామన్నారు. తమ కూటమిదే నిర్ణయాధికారంగా ఉంటుందని.. ఎవరినో ప్రధానిని చేయాలని తమ ఆశ కాదన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ తాపత్రయం అన్నారు కేసీఆర్. దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments