Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణం తీసిన పొరపాటు... రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నంలో జూ.ఆర్టిస్ట్ మృతి

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (09:00 IST)
ఓ చిన్నపొరపాటు ప్రాణం తీసింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేసిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన షాద్ నగర్ రైల్వే స్టేషనులో జరిగింది. సంక్రాంతి పండగకి సొంతూరుకు వెళ్లి తిరిగి హైదరాబాద్ నగరానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కడపకు చెందిన జ్యోతిరెడ్డి (28) అనే యువతి హైదరాబాద్ నగరంలో హెచ్‌డీఎఎఫ్‌సి బ్యాంకులో ఉద్యోగం చేస్తూనే జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లిన జ్యోతి సోమవారం రాత్రి తిరిగి హైదరాబాద్ నగరానికి పయనమైంది. 
 
ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రైలు షాద్ నగరులో రైల్వే స్టేషన్‌లో ఆగింది. రైలు ఆగడంతో కాచిగూడ వచ్చేశామని భావించిన జ్యోతి రైలు దిగేసింది. అయితే, ఆ తర్వాత అది షాద్‌నగర్‌ అని తెలుసుకుని కంగారుపడింది. అప్పటికే రైలు కదలదడంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి అదుపుతప్పి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన జ్యోతిరెడ్డిని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషయం తెలిసిన జూనియర్ ఆర్టిస్టులు జ్యోతి మృతికి రైల్వే నిర్లక్ష్యమే కారణంగా ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments