Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ రణ్‌వీర్ నౌకలో అగ్నిప్రమాదం - ముగ్గురి మృతి

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (08:34 IST)
ముంబై డక్ యార్డులో ఓ విషాద సంఘటన జరిగింది. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రణ్‌వీర్ డిస్ట్రాయర్ నౌకలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నౌకాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ నౌకలో ఉన్నట్టుండి పేలుడు సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. 
 
మీడియా కథనాల మేరకు ఐఎన్ఎస్ రణ్‌వీర్ ఇంటర్నెల్ కంపార్ట్‌మెంట్‌లో ఈ పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆస్తి నష్టం పెద్దగా సంభవించలేదు. 
 
ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ పేలుడు గల కారణాలు తెలియాల్సివుంది. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఓడలోని సిబ్బంది తక్షణం స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments