Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : మైనర్ నిందితులకు బెయిల్

Webdunia
గురువారం, 28 జులై 2022 (08:48 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నలుగురు నిందితులు మంగళవారం సాయంత్రం జువైనల్ హోం నుంచి విడుదలయ్యారు. 
 
గత మే నెల 28వ తేదీన 17 యేళ్ల మైనర్ బాలికపై అత్యాచానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో నలుగురు మైనర్ బాలుర్లతో పాటు ఒక మేజర్ సాహుద్దీన్ మాలిక్‌లు కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచారం జూబ్లీహిల్స్ సమీపంలోని ఓ ఏకాంత ప్రదేశంలో కారులోనే జరిగింది. మద్యంపార్టీకి వెళ్లిన బాలికపై కొందరు యువకులు ట్రాప్ చేసి, ఇంటివద్ద దించుతామని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. 
 
ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి దాదాపు 400 పేజీలతో కూడిన చార్జిషీటును సిద్ధం చేశారు. నిందితుల కాల్ లిస్ట్, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రిపోర్టులు, డీఎన్‌ఏ రిపోర్టులు, ఇతర సంబంధిత ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో దాదాపు 24 మంది సాక్షులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments