Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : మైనర్ నిందితులకు బెయిల్

Webdunia
గురువారం, 28 జులై 2022 (08:48 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నలుగురు నిందితులు మంగళవారం సాయంత్రం జువైనల్ హోం నుంచి విడుదలయ్యారు. 
 
గత మే నెల 28వ తేదీన 17 యేళ్ల మైనర్ బాలికపై అత్యాచానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో నలుగురు మైనర్ బాలుర్లతో పాటు ఒక మేజర్ సాహుద్దీన్ మాలిక్‌లు కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచారం జూబ్లీహిల్స్ సమీపంలోని ఓ ఏకాంత ప్రదేశంలో కారులోనే జరిగింది. మద్యంపార్టీకి వెళ్లిన బాలికపై కొందరు యువకులు ట్రాప్ చేసి, ఇంటివద్ద దించుతామని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. 
 
ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి దాదాపు 400 పేజీలతో కూడిన చార్జిషీటును సిద్ధం చేశారు. నిందితుల కాల్ లిస్ట్, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రిపోర్టులు, డీఎన్‌ఏ రిపోర్టులు, ఇతర సంబంధిత ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో దాదాపు 24 మంది సాక్షులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరుచేసింది. 

సంబంధిత వార్తలు

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments