Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు : మైనర్ నిందితులకు బెయిల్

Webdunia
గురువారం, 28 జులై 2022 (08:48 IST)
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ నలుగురు నిందితులు మంగళవారం సాయంత్రం జువైనల్ హోం నుంచి విడుదలయ్యారు. 
 
గత మే నెల 28వ తేదీన 17 యేళ్ల మైనర్ బాలికపై అత్యాచానికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో నలుగురు మైనర్ బాలుర్లతో పాటు ఒక మేజర్ సాహుద్దీన్ మాలిక్‌లు కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించి వారిని అరెస్టు చేశారు. 
 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ అత్యాచారం జూబ్లీహిల్స్ సమీపంలోని ఓ ఏకాంత ప్రదేశంలో కారులోనే జరిగింది. మద్యంపార్టీకి వెళ్లిన బాలికపై కొందరు యువకులు ట్రాప్ చేసి, ఇంటివద్ద దించుతామని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశారు. 
 
ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి దాదాపు 400 పేజీలతో కూడిన చార్జిషీటును సిద్ధం చేశారు. నిందితుల కాల్ లిస్ట్, ఫోరెన్సిక్‌ సైన్స్‌ రిపోర్టులు, డీఎన్‌ఏ రిపోర్టులు, ఇతర సంబంధిత ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ కేసులో దాదాపు 24 మంది సాక్షులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులోని నలుగురు మైనర్లకు జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments