బీజేపీలో చేరడం ఖాయం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 15 అక్టోబరు 2019 (07:20 IST)
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ, ఆమె కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి పార్టీ మారడం ఖాయమైంది. ఈ నెల చివరి వారంలో వారు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోనున్నారు.

పార్టీ మారే విషయమై ఆదివారం భీమ్‌గల్‌ మండలం మెండోర శివారులో అనుచరులతో సమావేశం నిర్వహించారు. పరిమిత సంఖ్యలో ముఖ్య అనుచరులను సమావేశానికి ఆహ్వానించగా, సుమారు మూడొందల మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అనుచరులంతా బీజేపీలో చేరాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీ వెంట మేముంటామని స్పష్టం చేశారు. ఇంతకాలం పదవిలో ఉన్నా, లేకున్నా వెంట ఉన్నామని, ఇకనుంచి కూడా ఉంటామన్నారు. బీజేపీ అగ్ర నాయకత్వం పార్టీలోకి ఆహ్వానించిన విషయాన్ని అన్నపూర్ణమ్మ అనుచరులకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీలో చేరడమే ఉత్తమమని అనుచరులు చెప్పారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున పోలింగ్‌ తర్వాత ఇరవై రెండో తేదీ నుంచి ఈ నెలాఖరు మధ్యలో ఎప్పుడైనా వారు బీజేపీలో చేరే అవకాశముంది. అన్నపూర్ణమ్మ, మల్లికార్జున్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరనున్నారు. తర్వాత స్థానికంగా బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు రాష్ట్రస్థాయి నాయకులను ఆహ్వానిస్తారు. ఈ సందర్భంగా అనుచరులు భారీ సంఖ్యలో బీజేపీలో చేరనున్నారు.

ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎంపీ అర్వింద్‌, అన్నపూర్ణ మ్మ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అప్పుడే చేరికకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ నెల పద్దెనిమిదో తేదీన పార్టీలో చేరాలని లక్ష్మణ్‌ సూచించగా, అనుచరులతో సమావేశమై చేరిక తేదీని ఖరారు చేస్తామని అన్నపూర్ణమ్మ చెప్పారు. అనుచరులతో సమావేశమై పార్టీలో చేరికను ఖరారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AA22: స్పైడర్-మ్యాన్, అవెంజర్స్ తరహాలో AA22 చిత్రం ఉండబోతుందా ?

K. Raghavendra Rao: మహిళలకు డైమండ్ డెకాయిట్ చిత్రం ఉచితం

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫుల్-లెంగ్త్ ఎంటర్టైనర్ : ప్రొడ్యూసర్ శివప్రసాద్

VV Vinayak: వివేక్ మిశ్రా, శృతిక జంటగా అహోం.ప్రారంభం

AA22 x A6 ప్రీ లుక్ పోస్టర్‌.- అంచనాలు రెట్టింపు చేసిన టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం

హెచ్చరిక: అందరి దృష్టిని ఆకర్షించేలా తన లేటెస్ట్ కలెక్షన్‌ను రూపొందించిన మోచీ

UP Woman Scripts History: ఖాట్మండు నుంచి ఎవరెస్ట్ వరకు సైకిల్ యాత్ర.. దివ్య సింగ్ రికార్డ్ (video)

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

తర్వాతి కథనం
Show comments