Webdunia - Bharat's app for daily news and videos

Install App

గులాబ్‌ తుఫాన్‌: JNTUH పరీక్షలు వాయిదా..

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (14:16 IST)
తెలంగాణలో కురుస్తున్న వర్షాల కారణంగా నేడు జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూ ప్రకటించింది. బీటెక్, ఫార్మసీ పరీక్షలు వాయిదా బడ్డాయి. నేడు జరగాల్సిన పరీక్షల షెడ్యూలు తర్వాత చేయనున్నారు. అయితే రేపట్నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథం కొనసాగుతాయని జేఎన్టీయూ వెల్లడించింది. 
 
తెలంగాణపై గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం గట్టిగా ఉండనుంది. రానున్న మూడు రోజులపాటు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
మరోవైపు కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు సీఎస్‌ సోమేష్‌ కుమార్‌. ప్రతీ జిల్లాలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గులాబ్ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
 
తుపాన్ కారణంగా రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్‌, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashu Reddy: అషు రెడ్డి బ్రెయిన్ సర్జరీ-ఇదే జీవితం.. ఇతరుల పట్ల దయతో వుండండి

మహేష్ బాబు కు ఈడీ నోటీసులు వల్ల ప్రయోజనం ఏమిటి?

మహేష్ బాబుకు షాక్- ఈడీ నోటీసులు జారీ.. 27న విచారణకు హాజరు

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments