Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జేఎన్టీయూలో నేటి నుచి బీటెక్ - బీఫార్మసి పరీక్షలు

జేఎన్టీయూలో నేటి నుచి బీటెక్ - బీఫార్మసి పరీక్షలు
, బుధవారం, 22 సెప్టెంబరు 2021 (07:35 IST)
హైదరాబాద్ నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయం (జేఎన్టీయు) పరిధిలో బీటెక్, బీఫార్మసీ ప్రథమ సంవత్సర రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను విద్యార్థులకు ఒకటి, రెండు రోజుల ముందుగానే అందించాల్సి ఉన్నా పలు కాలేజీల్లో విద్యార్థులకు హాల్‌టికెట్లు అందలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 
 
పరీక్షా సమయం దగ్గరపడినా హాల్‌టికెట్లు జారీచేయకపోతే పరీక్ష కేంద్రాల గురించి ఎలా తెలుసుకోవాలంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.  దీనిపై జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్‌ చంద్రమోహన్‌ను హాల్‌టికెట్ల పంపిణీపై వివరణ కోరగా ఇప్పటికే అన్ని కళాశాలలకు వాటిని పంపించినట్లు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీలో అసదుద్దీన్ ఇంటిపై దాడి... గూండాలను రెచ్చగొట్టారు: ఒవైసీ