Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిగా బాధ.. కానీ, దేశం కోసం అమరుడు కావడం సంతోషంగా వుంది...

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (21:59 IST)
భారత్ - చైనా బలగాల మధ్య సరిహద్దు ఘర్షణలు చెలరేగాయి. లడఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల్లో భారత సైన్యానికి చెందిన కల్నల్ అధికారితో పాటు.. మరో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. గత రాత్రి జరిగిన ఈ ఘటనలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన బి.సంతోష్ అనే కల్నల్ ర్యాంకు అధికారి కూడా మృతి చెందారు. 
 
బి. సంతోష్ బాబు తల్లిదండ్రులు సూర్యాపేటలో నివసిస్తుంటే, సంతోష్ కుటుంబం మాత్రం ఢిల్లీలో ఉంటున్నారు. ఈ క్రమంలో తన కుమారుడి మరణవార్తపై సూర్యాపేటలో ఉన్న ఆయన తల్లి మంజుల స్పందించారు. తనకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారని, ఆ ఒక్క కొడుకూ ఇప్పుడు అమరుడయ్యాడని ఆమె అన్నారు. 
 
తల్లిగా బిడ్డను కోల్పోయిన బాధ ఉన్నా, తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం పట్ల గర్వంగా వుందని పుట్టెడు దుఃఖాన్ని భరిస్తూ నిబ్బరంగా చెప్పారు. నిజానికి తన కుమారుడు చనిపోయాడన్న వార్త తన కోడలికి సోమవారం రాత్రే చెప్పారని, కానీ, తాను తట్టుకోలేనని మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు చెప్పారని కన్నీటిని పంటి బిగువున పెట్టి వివరించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments