Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నియంత్రణ పై శ్రద్ధ ఏది?: చంద్రబాబు విమర్శ

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (21:52 IST)
కరోనా నియంత్రణపైన ప్రభుత్వం ఎక్కడ శ్రద్ద చూపడం లేదని ప్రతిపక్షనేత ఎన్‌.చంద్రబాబునాయుడు విమర్శించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం అంకెల గారడీగా ఉందని, ఈ బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి వినాశనానికి దారితీస్తుందని విమర్శించారు.

ఆదాయమార్గాలు ఏమీ చూపకుండా మొత్తం అప్పులనే చూపించారని, దీంతో అభివృద్ది ఎలా సాధ్యమౌతుందని ప్రశ్నించారు. అరకొర కేటాయింపులతో అభివృద్ధి ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని అడిగారు. 

అసెంబ్లీ సమావేశాలకు సిఎంతో పాటు మంత్రులు కనీసం మాస్క్‌లు కూడా పెట్టుకోకుండా వచ్చారని, ప్రజలకు ఏం సందేశాన్నిస్తున్నారని ప్రశ్నించారు. పదోతరగతి పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్దులు, తల్లితండ్రుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ, తమిళనాడులో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments