Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్, కవిత కళ్లకు ఈ దారుణం కనపడటం లేదా?: ఇందిరాశోభన్

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (07:00 IST)
మహిళలు, చిన్నారుల మానప్రాణాలకు రక్షణ కల్పించలేని అసమర్థ కేసీఆర్ తక్షణమే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సీనియర్ నాయకురాలు ఇందిరాశోభన్. సైదాబాద్ లో చిన్నారి చైత్ర కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబానికి చెందిన ఆరేళ్ల పసిపాపపై అత్యాచారం, హత్య జరిగి నాలుగురోజులు గడిచినా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్లైనా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పెద్దలెవ్వరూ కనీసం ఈ దుర్ఘటనపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.

పేదల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయిందన్నారు. ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకున్న మంత్రి కేటీఆర్ కు.. ఈ ఘటనపై కనీసం ట్విట్టర్లో అయినా స్పందించేందుకు మనసెందుకు రావడం లేదో అర్థం కావట్లేదన్నారు. ముఖ్యమంత్రి కూతురు, ఎమ్మెల్సీ కవిత కళ్లకు ఈ దారుణం కన్పించడం లేదా అని ఆమె ప్రశ్నించారు. 
 
ఇక ఈ రాష్ర్టానికి హోంమంత్రి ఉన్నాడో లేడో కూడా తెలియని దుస్థితిలో ప్రజలున్నారని ఇందిరాశోభన్ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు ఆయన ఒక్కనాడు కూడా సమీక్షాసమావేశాలు నిర్వహించిన పాపాన పోలేదన్నారు. ఇక మహిళా మంత్రుల విషయం వేరే చెప్పనక్కర్లేదన్నారు.

కనీసం మానవత్వం ఉన్నవారెవరైనా ఈ ఘటనపై స్పందిస్తారని, అలాంటిది మహిళలై ఉండి, ఒక్క మంత్రి కూడా ఈ కుటుంబాన్ని ఇప్పటి వరకు పరామర్శించపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాదు.. షీటీమ్స్ కూడా నిద్రావస్థలోనే ఉండటం దౌర్భాగ్యమన్నారు ఇందిరా శోభన్.

ఈ ఘటన మరుకముందే మియాపూర్ లో 13 నెలల పసికందు హత్యకు గురవడం చూస్తుంటే అసలు రాష్ర్టంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని.. నిందితుడ్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని ఇందిరాశోభన్ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments