Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? (video)

ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? (video)
, మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (06:36 IST)
ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగేవారికి ఎసిడిటీ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మీ జీర్ణాశయంలో యాసిడ్, ఆల్కలీన్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది.

ఇతర పోషకాలను శోషించుకోవడాన్ని టీ నిరోధిస్తుంది. మీ మెటబాలిక్ సిస్టమ్, జీర్ణక్రియపై  తీవ్ర ప్రభావం చూపుతుంది. అల్సర్, స్కెలెటల్ ఫ్లోరోసిస్ అనే వ్యాధి బారిన పడతారు. అందుకే ఖాళీ కడుపుతో టీ తాగకండి. ఉదయం టిఫిన్ చేసిన గంట తర్వాత టీ తాగొచ్చు.

నిద్రలేమి సమస్య ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. రాత్రి త్వరగా భోజనం చేసి బెడ్‌పై పడుకున్నా.. ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు.

నిద్ర పోయే ముందు దీన్ని ఒక గ్లాస్ తాగితే మీరు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు....!
 
నిద్ర పట్టకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం, రోజూ ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కోవడం, ఇతర మానసిక సమస్యలు, ఫోన్లను ఎక్కువగా రాత్రి పూట ఉపయోగించడం.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్య వస్తోంది. అయితే అందుకు ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. నిద్రలేమి సమస్యను తగ్గించుకునేందుకు పాలు, తేనె అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో సెడేటివ్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. రాత్రి భోజనం అనంతరం ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో 1 టీస్పూన్ తేనెను కలిపి తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. కనీసం ఇలా వారం పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
 
2. పాలలో తేనె కలిపి తాగుతున్నా నిద్ర పట్టడం లేదని భావించే వారు అశ్వగంధ చూర్ణం వాడవచ్చు. పాలలో ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి తీసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించడంలో అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుంది. నిద్ర వచ్చేలా చేస్తుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కనుక పాలలో 1 టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తీసుకోవచ్చు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రిపూట ఇవి తింటే ఏమవుతుందో తెలుసా?