Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల నుంచి వస్తే.. 14 రోజులు ఇంట్లోనే..ఎక్కడ?

Webdunia
ఆదివారం, 8 మార్చి 2020 (12:14 IST)
కరోనా (కొవిడ్‌-19) నియంత్రణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల నుంచి వచ్చే వారు వ్యాధి లక్షణాలు లేకున్నా, 14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలని ఆదేశించింది.

ఆ తర్వాత పరీక్షలు చేశాకే వారు బయటకు రావాల్సి ఉంటుంది. ఈ దిశగా వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్‌ సోకినా 14 రోజుల తర్వాతే వ్యాధి లక్షణాలు బయటపడతాయన్న అంచనాతో విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల పాటు ఇంటి వద్దే ఉండాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.

అనుమానితుల చికిత్సలోనూ మార్పులు చేస్తున్నారు. విదేశాల నుంచి వ్యాధి లక్షణాలతో వచ్చిన వారిని, ఎలాంటి లక్షణాలు లేని వారిని వేర్వేరు చోట్ల ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు.

కేసులు లేవని తేలిగ్గా తీసుకోవద్దు రాష్ట్రంలో కేసులు లేవని తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగానే ఉండాలని మంత్రి ఈటల వైద్యాధికారులను కోరారు. ఆయన శనివారం పరిస్థితిని సమీక్షించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో కూడా మాట్లాడారు.

గాంధీ ఆసుపత్రిలోని ఏడో అంతస్తులో ఉన్న కరోనా వార్డుల్లోకి ఇతరులను అనుమతించవద్దని సూచించారు. బాధితుల్లో ఐటీ ఉద్యోగులు, ప్రముఖ బాధ్యతలు కలిగిన వారు ఉంటున్నందున వారి పనులకు ఇబ్బంది లేకుండా అవసరమైతే వైఫై సౌకర్యం కల్పించాలని సూచించారు.

వైద్యశాఖలోని అన్ని స్థాయుల అధికారులకు సెలవులు రద్దు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

తర్వాతి కథనం
Show comments