Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరితో సహజీవనం - మరొకరితో నిశ్చితార్థం - యువతి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (11:59 IST)
ఓ యువతి మరో యువకుడి చేతిలో మోసపోయింది. తనతో సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తి తనకు తెలియకుండా మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇల్లెందు పట్టణానికి చెందిన ఓ యువతి (34), వేంసూరు మండలం కందుకూరికి చెందిన బండి గౌతమ్ (32)లు బీఫార్మసీ కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ, మూడేళ్ళ క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. 
 
ఆ తర్వాత భార్యాభర్తలుగా చెప్పుకుని కేబీహెచ్‌బీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే గత యేడాదిగా వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమలో గౌతమ్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి నిలదీసింది. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన గౌతమ్ ఖమ్మంకు వెళ్లగా, 17వ తేదీన గౌతమ్‌కు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పింది. ఆ వెంటనే తన ఇంటిపై అంతస్తులో నివశించేవారికి గౌతమ్ ఫోన్ చేసి చెప్పాడు. వారు వెళ్లి చూసే సమయానికి ఆమె ఫ్యానుకు ఉరివేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments