Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకరితో సహజీవనం - మరొకరితో నిశ్చితార్థం - యువతి ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (11:59 IST)
ఓ యువతి మరో యువకుడి చేతిలో మోసపోయింది. తనతో సహజీవనం చేస్తూ వచ్చిన వ్యక్తి తనకు తెలియకుండా మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఇల్లెందు పట్టణానికి చెందిన ఓ యువతి (34), వేంసూరు మండలం కందుకూరికి చెందిన బండి గౌతమ్ (32)లు బీఫార్మసీ కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ, మూడేళ్ళ క్రితం ఫేస్‌బుక్ ద్వారా పరిచయమయ్యారు. 
 
ఆ తర్వాత భార్యాభర్తలుగా చెప్పుకుని కేబీహెచ్‌బీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే గత యేడాదిగా వారిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమలో గౌతమ్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి నిలదీసింది. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
ఆ తర్వాత ఈ నెల 16వ తేదీన గౌతమ్ ఖమ్మంకు వెళ్లగా, 17వ తేదీన గౌతమ్‌కు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు చెప్పింది. ఆ వెంటనే తన ఇంటిపై అంతస్తులో నివశించేవారికి గౌతమ్ ఫోన్ చేసి చెప్పాడు. వారు వెళ్లి చూసే సమయానికి ఆమె ఫ్యానుకు ఉరివేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments