Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ కలహాలతో విసుగు.. భర్తను ఇంట్లో పెట్టి తాళం వేసి.. బిడ్డతో పాటు..?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:46 IST)
క్షణికావేశాలు నేరాలకు ఘోరాలకు దారితీస్తున్నాయి. మహిళలపై ఓవైపు అకృత్యాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు గృహ హింస కూడా మానసిక ఆవేదనకు కారణమవుతున్నాయి. తాజాగా కుటుంబ సమస్యలతో విసిగివేసారిన ఓ మహిళ భర్తను ఇంట్లో తాళం వేసి తన 8 నెలల కూతురుతో సహా భవనం పైనుంచి దూకింది. 
 
హైదరాబాదు నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో సోమవారం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషాదంలో మహిళ చనిపోగా శిశువు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన బిస్మల్‌ సింగ్‌, అనిత(24) ఇరువురు దంపతులు. గడిచిన మూడు నెలలుగా బంజారాహిల్స్‌ పరిధి శ్రీనగర్‌ కాలనీలో నివాసముంటున్నారు. కాగా దంపతులిద్దరూ తరచుగా గొడవపడుతుండేవారు. బంధువులు వచ్చి సయోధ్య కుదిర్చి వెళ్తుండేవారు.
 
సోమవారం కూడా ఇలాగే ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. దీంతో భర్తను అనిత ఇంట్లో తాళం వేసి భవనం రెండో అంతస్థు బాల్కనీ నుండి తన చంటి బిడ్డతో సహా దూకింది. చుట్టుప్రక్కలవారు, స్థానికులు వెంటనే ఇరువురిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిత చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంజారాహిల్స్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కె. ఉదయ్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments