Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మద్యంమత్తులో కొడుకుని హత్య చేసిన తల్లి.. ఎక్కడ?

మద్యంమత్తులో కొడుకుని హత్య చేసిన తల్లి.. ఎక్కడ?
, బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (15:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో దారుణం చోటుచేసుకుంది. రామన్నగూడ గ్రామంలో ఓ మహిళ తాగిన మత్తులో కన్నబిడ్డనే గొంతునులిమి చంపేసింది. 
 
మంగళవారం సాయంత్రం కల్లు తాగిన పరమేశ్వరి అనే మహిళ రాత్రి సమయంలో ఆ మత్తులో తన కుమారుడు ధనుష్‌(2)ను హత్య చేసింది. మద్యం తాగొద్దని ఆమె మామ మందలించడంతో ఆగ్రహానికి గురైన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టింది. 
 
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నారా లోకేష్ బుద్ధీ, జ్ఞానం లేదు : ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు