Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలు... షెడ్యూల్ వివరాలు

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (20:38 IST)
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పేపర్లుండగా కరోనాతో వాటిని ఆరు పేపర్లకు కుదించింది. 
 
80 మార్కులకు ఎగ్జామ్.. 20 మార్కులకు ఇంటర్నల్స్ ఉండనున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా సిలబస్‌ను 70 శాతానికి తగ్గించిన సర్కార్.. తాజాగా పేపర్లను కూడా కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అవసరమైతే పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు జరుగనున్న నేపధ్యంలో పిల్లలకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
టెన్త్ పరీక్షలు రాసేందుకు 3.15 గంటల సమయం ఉంటుందని.. విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్ ఉండేలా ప్రశ్నల సంఖ్య కూడా పెంచనున్నట్టు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ అకాడమిక్‌ ఇయర్‌ 2020-2021కు గాను మొత్తం 11 పరీక్షా పేపర్లను 6 పేపర్లకు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. 
 
కొత్త విధానం ప్రకారం.. ఫస్ట్‌ లాంగ్వేజ్‌, ఇంగ్లీష్‌, మాథమెటిక్స్‌, జనరల్‌ సైన్స్‌(ఫిజిక్స్‌&బయాలజీ), సోషల్‌ స్టడీస్‌కు చెందిన పేపర్‌ -1, పేపర్‌-2లు ఒకే పరీక్షా పేపర్‌గా ఉండనున్నాయి. సెకండ్‌ లాంగ్వేజ్‌లో ఏ విధమైన మార్పు లేకపోగా.. ఫిజిక్స్‌, బయాలజీకి సంబంధించిన సమాధానాలు.. వేర్వేరు షీట్లలోనే రాయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.
 
ఆంధ్రప్రదేశ్ 
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ షెడ్యూల్‌ను రిలీజ్ చేశారు. జున్‌ 7 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయి. జున్‌ 16వ తేదీతో ముగుస్తాయి. మే 5 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 7 పేపర్లుగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జూలై 21వ తేదీ నుంచి ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments