Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ తింటూ గుండెపోటుతో కుప్పకూలిపోయింది..

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (11:13 IST)
బిర్యానీ అంటే చాలామందికి ఇష్టం. అలాంటి బిర్యానీ టేస్టీగా దొరికితే లొట్టలేసుకుని మరీ లాగించేస్తుంటారు చాలామంది. బిర్యానీ వేడి వేడిగా వేగంగా తినేస్తుంటారు చాలామంది. ఇలా బిర్యానీ తింటుండగా గుండెపోటుతో రావడంతో ఓ మహిళ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టు పీఎస్ పరిధిలో జరిగింది. 
 
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నగట్టుపల్లి గ్రామానికి చెందిన గడ్డం సాయమ్మ(40) బంధువు వారం రోజుల క్రితం హైదరాబాద్ లో చనిపోయాడు. వారి కుటుంబీకులను పరామర్శించేందుకు ఆమె సిటీకి వచ్చింది.
 
గురువారం తిరిగి సొంతూరికి వెళ్లేందుకు సాయమ్మ శంషాబాద్ బస్టాండ్‌కి చేరుకుంది. అక్కడ బాక్సులో తన వెంట తెచ్చుకున్న బిర్యానీని తింటూ ఒక్కసారిగా కుప్పకూలింది. ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు సీఐ విజయ్ కుమార్ సాయమ్మ గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments