హైదరాబాదులో మోదీ పర్యటన.. నగరంలో ఆంక్షలు ఎక్కడంటే..?

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (14:54 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాదులో శనివారం పర్యటిస్తున్న నేపథ్యంలో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్‌ ట్రాపిక్‌ పోలీసులు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 
 
ఆపై సికింద్రాబాద్- తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నేరుగా  పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఆ మార్గంలో ప్రయాణించొద్దని ప్రయాణికులకు పోలీసులు సూచించారు.
 
ఇంకా ప్రధాన పర్యటన సందర్భంగా మోనప్ప జంక్షన్-టివోలి జంక్షన్-సెయింట్ జాన్ రోటరీ-సంగీత్ క్రాస్ రోడ్–చిలకలగూడ జంక్షన్, ఎంజీ రోడ్‌, ఆర్‌పీరోడ్‌-ఎస్పీ రోడ్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడం జరిగింది. 
 
అలాగే ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే...
టివోలి క్రాస్‌రోడ్‌ నుంచి ప్లాజా క్రాస్‌రోడ్‌ల మధ్య ఉన్న రోడ్డును మూసివేస్తారు. 
ఎస్‌బీఎస్‌ క్రాస్‌రోడ్‌ల మధ్య స్వీకర్ ఉప్కార్ జంక్షన్- వైస్ వెర్సా మధ్య రోడ్డు మూసివేత
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రైలులో ప్రయాణించే సాధారణ ప్రయాణికులు సకాలంలో రైల్వేస్టేషన్‌ చేరుకోవాలి.  చిలకలగూడ జంక్షన్‌ వైపు నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌లోకి ప్రవేశాలను పరిమితం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments