Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురీషనాళంలో 514 గ్రాముల బంగారాన్ని దాచిపెట్టాడు.. చిక్కాడు..

gold coins
, శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (11:07 IST)
రూ.32 లక్షలకు పైగా విలువ చేసే 514 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు గురువారం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
 
ప్యాసింజర్ ప్రొఫైలింగ్ ఆధారంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ కస్టమ్స్ అధికారి తెలిపారు. గురువారం రియాద్‌ నుంచి హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
 
"అనుమానంతో, కస్టమ్స్ అధికారులు నిందితుడిని సోదా చేశారు. ప్రయాణికుడు 514 గ్రాముల బంగారు పేస్ట్‌ను మూడు గుళికల రూపంలో పురీషనాళంలో దాచిపెట్టినట్లు గుర్తించారు. బంగారం విలువ రూ. 32,08,902 ఉంటుందని అంచనా" అధికారి తెలిపారు.
 
కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 110 కింద బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని, చట్టంలోని సెక్షన్ 104 కింద నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్లపల్లి వరకు వందే భారత్ రైలు... 8న ప్రారంభం