Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ ఎండలే ఎండలు.. బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీలు

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (12:11 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతను అధికమించేందుకు ప్రజలు నానాతంటాలు పడుతున్నారు. మరోవైపు, విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగిపోయింది. 
 
హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు మంగళవారం హైదరాబాద్ నగరంలోని బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఖైరతాబాద్‌లో 40.1 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 39.9 డిగ్రీలు, షేక్‍పేటలో 38.9 డిగ్రీలు, మియాపూర్‌లో 38.7, సరూర్ నగర్‌లో 38.1, కాప్రాలో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా రాత్రిపూట కూడా ఈ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి ఏకంగా 25 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది.
 
అయితే, బుధవారం మాత్రం హైదరాబాద్ నగరంపై ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాంయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నెల 3వ తేదీన గరిష్టంగా 69.10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments