Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ ఎండలే ఎండలు.. బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీలు

Webdunia
బుధవారం, 5 ఏప్రియల్ 2023 (12:11 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోయాయి. బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతను అధికమించేందుకు ప్రజలు నానాతంటాలు పడుతున్నారు. మరోవైపు, విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా పెరిగిపోయింది. 
 
హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడించిన వివరాల మేరకు మంగళవారం హైదరాబాద్ నగరంలోని బోరబండలో అత్యధికంగా 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఖైరతాబాద్‌లో 40.1 డిగ్రీలు, శేరిలింగంపల్లిలో 39.9 డిగ్రీలు, షేక్‍పేటలో 38.9 డిగ్రీలు, మియాపూర్‌లో 38.7, సరూర్ నగర్‌లో 38.1, కాప్రాలో 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా రాత్రిపూట కూడా ఈ ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతున్నాయి. మంగళవారం రాత్రి ఏకంగా 25 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది.
 
అయితే, బుధవారం మాత్రం హైదరాబాద్ నగరంపై ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, సాంయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. ఈ నెల 3వ తేదీన గరిష్టంగా 69.10 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments