Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహబూబాబాద్ జిల్లాలో విషాదం..13 ఏళ్ళ బాలిక గుండెపోటుతో మృతి

Girl
, శనివారం, 1 ఏప్రియల్ 2023 (17:03 IST)
Girl
మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం శివారులో బోడతండాకు చెందిన బోడ లక్పతి, వాసంతి దంపతుల ముద్దుల కుమార్తె స్రవంతి (13) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించింది. 
 
ఓ స్థానిక ప్రైవేట్ స్కూల్‌లో ఆరగ తరగతి చదువుకుంటున్న స్రవంతి, గురువారం శ్రీరామనవమి సందర్భంగా స్కూలుకు సెలవు కావడంతో సాయంత్రం వరకు తండాలో తోటి మిత్రులతో హాయిగా ఆడుకుంది. రాత్రి అమ్మ చేతి గోరుముద్దలు తిని నాన్నమ్మ పక్కలో పడుకుని కథలు చెప్పించుకుని హాయిగా పడుకుంది. 
 
శుక్రవారం తెల్లవారుజామున నిద్రలేచి ఆయాసపడుతూ తల్లితండ్రులను లేపి గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో వారు అప్పటికప్పుడు గ్రామంలోని ఆర్‌ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. కానీ అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యుడు చెప్పడంతో తల్లితండ్రులు గుండెలు బాదుకొంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేవీపీ సంచలన వ్యాఖ్యలు.. ఒక అవినీతిపరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహమా..?