Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ : అసదుద్దీన్ జోస్యం

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (14:42 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ మహా నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనున్నారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు బెంగుళూరు, చెన్నై, ముంబై నగరాలు కూడా యూటీలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన జోస్యం చెప్పారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలను తాను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. 
 
ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామంతోపాటు ఇతర అధికారాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనిపై గురువారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఇందులో అసదుద్దీన్ పాల్గొని ప్రసంగిస్తూ, ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ, ఆప్ పార్టీలు తమ రాజకీయ పోరాటాన్ని, ఆధిపత్యాని సభ బయట చూపించుకోవాలని ఆయన కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వ మనిషేనన్నారు. కేంద్రం ప్రభుత్వంలోని పెద్దల ఆలోచనల నుంచే ఆయన బయటకు వచ్చారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments