కోపం, కామం, అహంకారం, దురాశ అనే భావనలు మనలో ఒక్కోసారి ఉద్భవిస్తాయి  మనం కొన్ని తప్పులు చేస్తాం. వాటి కారణంగా మన మనస్సు బాధలను ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో కొబ్బరి దీపాలను వెలిగించడం మన మనస్సును మంచి స్థితిలో ఉంచడానికి సహాయపడుతుంది. చంద్రుడు "మనః కారకుడు". 
 
 			
 
 			
			                     
							
							
			        							
								
																	
	 
	తమ పనిలో, చదువుల్లో ఏకాగ్రత లేని వారి మనస్సు ఎల్లప్పుడూ చంచలనం చెందుతుంది. మనశ్శాంతి కరువైనప్పుడు.. వ్యక్తిగత, వృత్తి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనస్సు కూడా బాధ్యత వహిస్తుంది. 
	 
	కాబట్టి మన మనస్సుకు కొంత బలం, ప్రశాంతత చేకూర్చేందుకు కొబ్బరికాయలో దీపం వెలిగించి షిర్డీ సాయిబాబా, చంద్ర భగవానుడు, పార్వతి, సరస్వతి, మహాలక్ష్మిని పూజించడం చాలా మంచి మార్గమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.