Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంట్రల్ బ్యాంకులో చోరీ చేసిన భార్యాభర్తలు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (09:48 IST)
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న సెంట్రల్ బ్యాంకులో ఇద్దరు భార్యాభర్తలు చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గచ్చిబౌలిలో సెంట్రల్ బ్యాంకుకు చెందిన ఓ బ్రాంచ్ వుంది. ఇందులో చోరీ చేయడానికి భార్యాభర్తలు వచ్చారు. ముందుకు బ్యాంకులోకి ప్రవేశించేందుకు కొన్ని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించి, స్ట్రాంగ్ రూం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ, అది సాధ్యపడలేదు. దీంతో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను ఎత్తుకుని వెళ్లారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వ్యవహారంపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చోరీకి పాల్పడిన దంపతుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments