Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్య ప్రసవానికి డబ్బుల్లేక దొంగతనం చేశాడు.. హత్య కూడా చేశాడు.. చివరికి?

Advertiesment
Mumbai
, సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:20 IST)
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రసవానికి డబ్బు లేక ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య ప్రసవానికి చేతిలో డబ్బుల్లేక అతడు హంతకుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. షేక్‌ అనే వ్యక్తి భార్య గర్భంతో ఉంది. 
 
ఆమె ప్రసవానికి డబ్బు లేకపోవడంతో చోరీ చేయాలని భావించాడు. ఇందు కోసం ట్రైన్ ఎక్కాడు. ట్రైన్‌లో జైశ్వాల్ కుర్లా అనే వ్యక్తి పర్సును దొంగలించాడు. అతడు ఎక్కడ ఈ విషాయాన్ని పోలీసులకు చెప్తాడో అనే భయంతో అతడిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
 
ట్రైన్‌లో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా విచారించి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో షేక్ చెప్పిన విషయం పోలీసులను షాక్‌కు గురి చేసింది.

తన భార్య ప్రసవానికి డబ్బు లేకే ఈ పని చేశానని ఒప్పుకున్న హంతకుడు దొంగిలించిన పర్సులో కేవలం రూ. 70 మాత్రమే ఉన్నాయని తెలిపాడు. 70 రూపాయల కోసం ఓ నిండు ప్రాణం తీసి జైలు పాలయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసీపీ నాయకుడు నిరుద్యోగులకు టోకరా, అడిగితే బెదిరిస్తున్నాడు