Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకు ఢీకొన్ని పూర్తిగా కాలిపోయిన బస్సు... బైకర్ సజీవదహనం

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (13:57 IST)
మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి శామీర్ పేట మండలంలోని జీనోమ్ వ్యాలీలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగులతో వెళుతున్న బస్సును మంగళవారం ఉదయం ఓ బైకర్ ఢీకొన్నాడు. దీంతో బైకు పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు ఎసిగిపడ్డాయి. ఈ మంటలు బస్సుకు కూడా వ్యాపించడంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. మంటల్లో చిక్కుకున్న బైకర్ సజీవదహనమయ్యాడు. అయితే, మంటలు ఒక్కసారిగా చెలరేగగానే బస్సులోని ప్రయాణికులంతా ప్రాణభయంతో క్షేమంగా బయటపడ్డారు. 
 
ఈ ప్రమాదంపై బస్సులోని ప్రయాణికులు స్పందిస్తూ, యూజే ఫార్మా కంపెనీ ఉద్యోగి సంపత్ విధులకు హాజరయ్యేందుకు బైకుపై వెళుతున్నాడు. కొల్తూరు వద్ద బైక్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఫార్మా కంపెనీ బస్సును ఢీకొట్టింది. దీంతో బైకుతో సహా సంపత్ కిందపడ్డాడు. అదేసమయంలో బైకు పెట్రోల్ ట్యాంకు పగిలిపోవడంతో ఒక్కసారిగా మంటలు అంటున్నాయి. దీంతో బస్సు, బైకు రెండూ కాలిపోయాయి. ఈ మంటల్లో చిక్కుకున్న బైకర్ సంపత్ సజీవదహనమయ్యాడు. మృతుడి స్వస్థలం సిద్ధిపేట జిల్లా ములుగు మండలం వరదరాజపురం అని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments