Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌లో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసిన అతివేగం..

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (17:31 IST)
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో కొత్త సంవత్సరాది రోజున అతివేగం ఇద్దరి వ్యక్తుల ప్రాణాలు హరించింది. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని సంతోషంతో ఇంటికి వెళుతున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. 
 
మృతులను గుర్తించాల్సివుంది. విద్యా నగర్‌కు చెందిన ప్రణవ్, వర్థన్‌లుగా కలిసి కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి సెలీరియా కారులో ఇంటికి బయలుదేరారు. ఈ కారును అమిత వేగంతో నడపడం వల్ల ఓ మలుపు వద్ద కారు వేగాన్ని నియంత్రించలేక పక్కనే నడిచి వెళుతున్న పాదాచారులను, మరో రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై వెళుతున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ప్రమాదంలో వర్ధన్ తీవ్రంగా ప్రణవ్ గాయపడగా, అతన్ని వెల్‌నెస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన స్నేహితుడు వర్థన్‌తో కలిసి ప్రణవ్ మద్యం సేవించి వాహనం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదానికి కారణమైన ప్రణవ్, వర్థన్‌లు మణిపాల్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments