Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తా : వీవీ లక్ష్మీనారాయణ

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (16:55 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు జిల్లాలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ -ఏపీటీఏ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ జరిగింది. ఇందులో ఆయన పాల్గొని పలువురు విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు. 
 
ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. అయితే, తాను స్వతంత్ర అభ్యర్థి పోటీ చేస్తానా లేక కొత్త పార్టీ స్థాపిస్తానా? మరో రాజకీయ పార్టీలో చేరుతానా? అనే విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తానని తెలిపారు. 
 
కాగా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే పేద విద్యార్థుల్లో అర్హులైన వారిని ఆదుకునేందుకు ఏపీటీఏ ఉపకార వేతనాలు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments