Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేస్తాను : లక్ష్మీనారాయణ

JD Lakshminarayana
, శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:39 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ డైరెక్టర్ జనరల్ లక్ష్మీనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన పోటీపై ఆయన స్పందించారు. 
 
వచ్చే ఎన్నికల్లో తన ఆలోచనలకు దగ్గరగా ఉండే పార్టీ తరపున పోటీ చేస్తానని తెలిపారు. అయితే, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానోనన్న విషయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోందన్నారు. 
 
తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం ఇపుడు సుప్రీంకోర్టులో ఉందని ఆయన గుర్తు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైఎస్ షర్మిల అరెస్ట్.. కేసీఆర్ పతనానికి ఇదే నాంది..