Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త వేధింపులకు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (13:34 IST)
సామాన్య ప్రజలను వేధిస్తే వారి తాట తీసేందుకు పోలీస్ యంత్రాంగం ఉంది. కానీ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే మహిళలకే భర్త నుంచి వేధింపులు ఎదురైతే. ఇదే జరిగింది. ఏ రంగంలో పనిచేసినా.. ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా మహిళలకు వేధింపులు తప్పటంలేదు. ఈ క్రమంలో ఏఆర్‌ మహిళా కానిస్టేబుల్ భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
ఈ ఘటన హైదరాబాద్ లోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కవాడీగూడలో నివాసముంటన్న లత అనే 23 ఏళ్ల కానిస్టేబుల్ పీఏఆర్‌ హెడ్‌క్వార్టర్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. లత భర్త లక్ష్మీ నరసింహ సింగరేణి కాలరీస్‌ ఆఫీస్‌లో అటెండర్‌గా పని చేస్తున్నాడు. భార్యను తరచు వేధింపులకు గురిచేస్తుండేవాడని లత కుటుంబ సభ్యులు..స్థానికులు తెలిపారు. అయినా ఓర్చుకుంటూ తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్న లత మితిమీరిన భర్త వేధింపులు భరించలేక తన ఇంటిలోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
 
కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గాంధీనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపుల కారణంగానే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి పద్మ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments