Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పిన పార్టీకి భార్య ఓటేయలేదని.. చిటికెన వేలును తెగ్గోసిన భర్త

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (15:29 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ శుక్రవారం పూర్తయిన నేపథ్యంలో తాను చెప్పిన పార్టీకి ఓటేయలేదని.. ఓ భర్త కత్తితో వెంటపడి మరీ వేలును నరికేశాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలంలోని సర్వాయిపేటలో వుంటున్న ఓ జంట ఎన్నికల సందర్భంగా ఓ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకుంది. ఓటింగ్ పూర్తయ్యాక తాను చెప్పిన పార్టీకి భార్య టేయలేదని తెలుసుకున్న భర్త కోపంతో ఊగిపోయాడు. 
 
తాను చెప్పిన పార్టీకి కాకుండా ఇంకో పార్టీకి ఓటేస్తావా అంటూ కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు చేతిని అడ్డంగా పెట్టడంతో ఆమె చిటికెన వేలు తెగింది. ఈ ఘటనలో గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments