Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పిన పార్టీకి భార్య ఓటేయలేదని.. చిటికెన వేలును తెగ్గోసిన భర్త

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (15:29 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ శుక్రవారం పూర్తయిన నేపథ్యంలో తాను చెప్పిన పార్టీకి ఓటేయలేదని.. ఓ భర్త కత్తితో వెంటపడి మరీ వేలును నరికేశాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలంలోని సర్వాయిపేటలో వుంటున్న ఓ జంట ఎన్నికల సందర్భంగా ఓ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకుంది. ఓటింగ్ పూర్తయ్యాక తాను చెప్పిన పార్టీకి భార్య టేయలేదని తెలుసుకున్న భర్త కోపంతో ఊగిపోయాడు. 
 
తాను చెప్పిన పార్టీకి కాకుండా ఇంకో పార్టీకి ఓటేస్తావా అంటూ కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు చేతిని అడ్డంగా పెట్టడంతో ఆమె చిటికెన వేలు తెగింది. ఈ ఘటనలో గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments