Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తింటికి వచ్చిందనీ భార్య మెడను కోసిన భర్త...

మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఓ కిరాతక భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. భార్య అత్తింటికి వచ్చిందనీ ఆమె మెడ కోశాడు. ఈ దారుణం రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

Webdunia
గురువారం, 14 డిశెంబరు 2017 (08:36 IST)
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఓ కిరాతక భర్త కిరాతకంగా ప్రవర్తించాడు. భార్య అత్తింటికి వచ్చిందనీ ఆమె మెడ కోశాడు. ఈ దారుణం రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
తొనిగండ్ల గ్రామానికి చెందిన పుర్ర కుమార్‌కు నార్సింగి మండల కేంద్రానికి చెందిన సరితతో గత 10 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. కాగా వీరిద్దరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మద్య తరతూ గొడవలు జరుగుతుండేవి. గత రెండు నెలల క్రితం ఇంట్లో గొడవ జరగ్గా సరిత తన పుట్టింటికి వెల్లి పోయింది. 
 
ఈ క్రమంలో ఇటీవల సరిత అత్త, మామలు నచ్చ చెప్పి ఆమె పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకొచ్చారు. ఈవిషయం తెల్సుకున్న భర్త బుధవారం ఇంటికి చేరుకుని భార్యపై కత్తితో దాడి చేశాడు. భర్త చర్యను భార్య అడ్డుకుంది. అయినప్పటికీ వదిలిపెట్టని భర్త ఆమె మెడ భాగంతో పాటు, చేతులపై దాడి చశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. 
 
తనను చంపేస్తాడనీ భావించిన ఆమె.. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగువారు వచ్చేసరికి కుమార్ పారిపోయాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను రామాయంపేటలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments