Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జైరా వసీం లైంగిక వేధింపులు.. భర్తకు వత్తాసు పలికిన భార్య

'దంగల్' నటి జైరా వసీంను విమానంలో లైంగికంగా వేధించిన కేసులో ప్రధాన నిందితుడికి ఆయన భార్య నుంచి ఫుల్‌సపోర్టు లభించింది. తన భర్త చాలా బుద్ధిమంతుడని, పరాయి స్త్రీలను అమితంగా గౌరవిస్తాడంటూ చెప్పుకొచ్చింది.

జైరా వసీం లైంగిక వేధింపులు.. భర్తకు వత్తాసు పలికిన భార్య
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:32 IST)
'దంగల్' నటి జైరా వసీంను విమానంలో లైంగికంగా వేధించిన కేసులో ప్రధాన నిందితుడికి ఆయన భార్య నుంచి ఫుల్‌సపోర్టు లభించింది. తన భర్త చాలా బుద్ధిమంతుడని, పరాయి స్త్రీలను అమితంగా గౌరవిస్తాడంటూ చెప్పుకొచ్చింది.
 
నటి జైరా వసీం విస్తారా ఎయిర్‌లైన్స్‌ విమానంలో శనివారం రాత్రి ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తుండగా తోటి ప్రయాణికుడు అసభ్యంగా వర్తించిన విషయం తెల్సిందే. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆ నటి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇది వైరల్ కావడంతో సీరియస్ అయిన కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. అదేసమయంలో ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన పోలీసులు అసభ్య ప్రవర్తన అభియోగంపై వికాస్‌ సచిదేవ్‌(39) అనే ప్రయాణికుడిని అరెస్టు చేశారు. 
 
ఈ వ్యవహారంపై ఆయన స్పందిస్తూ, విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు జైరా వసీమ్‌కు తన కాలు అనుకోకుండా తగిలిందని, దీంతో తనపై ఆమె గట్టిగా అరవడంతో తాను క్షమాపణ కూడా చెప్పానని అతను తెలిపాడు. పైగా, ఢిల్లీలో బంధువు అంత్యక్రియలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్న తనకు మనసు బాగా లేదని కూడా అతను పోలీసులకు వివరించాడు. అంత్యక్రియల్లో పాల్గొన్నందున ఎక్కువసేవు నిద్రకూడా పోలేదనీ అందువల్ల తనను లేపవద్దని క్యాబిన్‌ సిబ్బందికి చెప్పినట్లు సచిదేవ్‌ పోలీసులకు తెలిపాడు. 
 
ఈ ఘటనపై భర్తకు భార్య దివ్య కూడా వత్తాసు పలికింది. తన భర్త మానసిక స్థితి బాగో లేదని, డిప్రెషన్‌లో ఉన్నారని ఆమె చెప్పుకొచ్చింది. తన భర్త మావయ్య చనిపోయినందున ఆయన దిగులుతో ఉన్నారని దివ్య పోలీసులకు చెప్పింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మనం సైతం'కు చిరంజీవి విరాళం... కాదంబరికి అభినందనలు