Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె ప్రవర్తన సరిగాలేదనీ గొంతుపై కాలేసి తొక్కిచంపేశారు...

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తమ కుమార్తె ప్రవర్తన సరిగా లేదన్న కారణంతో ఆమె గొంతుపై కాలేసి తొక్కి చంపేశారు. ఆ తర్వాత శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (11:15 IST)
నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. తమ కుమార్తె ప్రవర్తన సరిగా లేదన్న కారణంతో ఆమె గొంతుపై కాలేసి తొక్కి చంపేశారు. ఆ తర్వాత శరీరంపై కిరోసిన్ పోసి నిప్పంటించి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసులకు అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే... 
 
జిల్లాలోని చింతపల్లి మండలం తీరేడు అనే గ్రామానికి చెందిన నరసింహ, లింగమ్మ అనే దంపతులకు 13 యేళ్ల కుమార్తె ఉంది. ఈమె ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటూ వచ్చింది. దీంతో ఆమె ప్రవర్తనను సందేహించిన తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ ఆ బాలిక తీరుమారలేదు. 
 
దీంతో తండ్రి నరసింహ కూతురి గొంతు నులిమాడు. అప్పటికీ కసితీరక గొంతుపై కాలేసి తొక్కి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లోనే కిరోసిన్ పోసి నిప్పంటించి తగలబెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు. మృతిపై సందేహించిన పోలీసులు ఆరా తీయగా అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నరసింహ, లింగమ్మ దంపతులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments