Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరికేన్ వల్లే ఇంధన ధరలు పెరుగుదల : పెట్రోలియం మంత్రి

కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (10:40 IST)
కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 
 
గత రెండు నెలలుగా ఇంధన ధరలు పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, అమెరికాను వణికించిన హార్వే, ఇర్మా తుఫానుల కారణంగా, అంతర్జాతీయంగా రిఫైనరీ ఔట్ పుట్ 13 శాతం పడిపోయిందని... ఈ కారణంగానే ఇంధన ధరలు పెరిగాయన్నారు. 
 
అయితే, దీపావళి నాటికి వీటి ధరలు తగ్గుతాయన్నారు. వచ్చే నెలలో ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. రోజువారీ ఇంధన ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధానంపై విమర్శలు వచ్చినప్పటికీ... మంత్రి మాత్రం రోజువారీ ధరల సమీక్ష చాలా పారదర్శకంగా ఉందని సమాధానం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments