Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో దారుణం, రెండేళ్లుగా యువతిపై తాత, మేనమామల అత్యాచారం

Webdunia
బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (19:37 IST)
తెలంగాణలో సభ్య సమాజం తలదించుకునే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాలనగా చూడాల్సి మనవారిలిపై ఓ తాత తన పైశాచికత్వం చూపించాడు. అంతేకాదు బాధ్యతగా మేనకోడలిని రక్షించాల్సిన మేనమామ సైతం ఆమెపై తన క్రూరత్వం ప్రదర్శించాడు. ఫలితంగా తాను ఉంటున్న ఇంట్లోనే.. నా అనుకున్నవారి చేతిలోనే... ఆ యువతికి తీరని అన్యాయం జరిగింది. 
 
తాత, మేనమామ కలిసి ఆమెపై గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతుండటంతో.. భరించలేని ఆ అభాగ్యురాలు చివరికి జరిగిన దారుణాన్ని తన తల్లికి తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 
బండ్లగూడ మహ్మద్‌ నగర్‌కు చెందిన షేక్‌ అఫ్సర్‌‌కు 70 ఏళ్లు. ఆయన మనవరాలికి 19 ఏళ్లు. చిన్నతనం నుంచే తాత ఇంట్లోనే పెరిగింది. బాలికపై కన్నేసిన తాతయ్య షేక్‌ అఫ్సర్‌ రెండేళ్ల క్రితం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతని కుమారుడు షేక్‌ సిద్దిఖ్‌ సైతం ఆరు నెలల క్రితం ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించారు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పడంతో ఆమె చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం