Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాత్రూంలోకి వెళ్లి బయటకు రాలేదు... తలుపు తీస్తే పడిపోయి వుంది..

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (19:40 IST)
అప్పటిదాకా తోటి విద్యార్థులతో కలిసి మెలసి ఉన్న స్నేహితురాలు పాఠశాలకు టైం అవుతుంది అని చెప్పి తొందరగా రెడి కావాలి అంటూ బాత్‌రూమ్ లోకి వెళ్లింది. ఐతే ఆ తర్వాత ఆమె ఎంతకూ బయటకు రాలేదు. దాంతో తలుపులు పగులగెట్టి చూసేసరికి స్ప్రుహ లేకుండా కింద పడి ఉన్న స్నేహితురాలిను చూసిన తోటి విద్యార్థులు వెంటనే ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. 
 
వెంటనే జనగామ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో మృతి చెందింది విద్యార్థిని. ప్రిన్సిపాల్ విద్యార్థిని బంధువులకు సమాచారం అందించారు.విద్యార్థిని మృతికి యాజమాన్యం నిర్లక్ష్యం కారణం అంటూ వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు.
 
 భువనగిరి జిల్లా ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో బ్యాక్ టూ బ్యాక్ క్రిస్టియన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన వసతి గృహంలో నల్గొండ జిల్లా, తిరుమలగిరి మండలం మొఖ్య తండాకు చెందిన కేతవత్ బిందు (14 సంవత్సరాలు) ఆలేరు జేఎంజె పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. 
 
రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం త్వరగా పాఠశాలకు వెళ్ళాలి అని బాత్రూం లోకి వెళ్లి రాకపోవడంతో తోటి విద్యార్థులు ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. తమ బిడ్డ బిందు మృతికి వసతి గృహం యాజమాన్యం నిర్లక్ష్యం కారణం అని బంధువులు వసతి గృహం ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments