Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం: జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (11:58 IST)
గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి చెందారు. కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ రోడ్డులో చోటుచేసుకుంది. 
 
శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మానస (22), మానస (21)గా గుర్తించారు. వీరితో పాటు డ్రైవర్‌ అబ్దుల్లా మృతి చెందాడు. మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు విజయవాడకు చెందిన బ్యాంక్‌ ఉద్యోగి అబ్దుల్‌ రహీం కూడా మరణించాడు.
 
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సిద్ధూను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments