Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం: జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి

Webdunia
శనివారం, 18 డిశెంబరు 2021 (11:58 IST)
గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు మృతి చెందారు. కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు, డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ రోడ్డులో చోటుచేసుకుంది. 
 
శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు మానస (22), మానస (21)గా గుర్తించారు. వీరితో పాటు డ్రైవర్‌ అబ్దుల్లా మృతి చెందాడు. మరో జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు విజయవాడకు చెందిన బ్యాంక్‌ ఉద్యోగి అబ్దుల్‌ రహీం కూడా మరణించాడు.
 
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సిద్ధూను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments