హైదరాబాద్ మెట్రో సరికొత్త ఆఫర్.. రూ.59 చెల్లిస్తే రోజంతా ఎక్కడైనా?

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (15:58 IST)
హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తాజాగా జనం మెచ్చే సరికొత్త భారీ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.59 ధర చెల్లించి ఒక రోజులో ఎక్కడి నుంచి మరెక్కడికైనా ఎన్నిసార్లైనా తిరిగే వెసులుబాటు కల్పించింది. 
 
అయితే, ఈ ఆఫర్ అన్ని రోజుల్లో వర్తించదు. కొన్ని నిర్దేశిత సెలవు రోజుల్లో మాత్రమే వర్తించనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. నెలలో ప్రతి ఆదివారం, ప్రతి రెండోది, నాలుగో శనివారం రోజులు సెలవులుగా పేర్కొంది. 
 
అంతేకాక, ఉగాది, రంజాన్, మొహర్రం, బోనాలు, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, వినాయక చవితి, కృష్ణాష్టమి, దుర్గాష్టమి, దసరా, దీపావళి, డిసెంబరు 26 బాక్సింగ్ డే, బోగీ, సంక్రాంతి, శివరాత్రి రోజుల్లో మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని కేవీబీ రెడ్డి తెలిపారు. 
 
'సూపర్ సేవర్‌ కార్డు' పేరుతో ఈ ఆఫర్‌ను ప్రవేశపెడుతున్నట్లుగా ఎల్‌ అండ్‌ టీ మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి ప్రకటించారు. ఈ కార్డుతో సెలవుల్లో కేవలం రూ.59 చెల్లించి రోజంతా మెట్రో రైలులో ప్రయాణించవచ్చని కేవీబీ రెడ్డి వెల్లడించారు. 
 
నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగొచ్చని చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లోనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments